testing
Clipo
ఘనంగా శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు
శ్రీకాళహస్తి వైఎస్ఆర్ పార్టీ నేతలు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి వైయస్సార్ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ షేరాజ్ భాష మరి కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి ఆనందంగా చిందులు వేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.
*జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న పేట బ్రదర్స్ మిత్రబృందం*
సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారి నాయకత్వంలో పెళ్లకూరు మండల నాయకులు తాళ్ల రెడ్డి శ్రీనివాస్ గారు నిర్వహించిన పునబాక గ్రామం నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది.
సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, సూళ్లూరుపేట నియోజకవర్గంలోనీ అన్ని పంచాయతీలలో మన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగాలని నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, మరియు ఈ రోజు తాల్ల రెడ్డి శ్రీనివాస్ ఘనంగా తన గ్రామంలో జండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, మండల జనసేన నాయకులు, వీర మహిళలు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, మహేష్, మనీ, నాదెండ్ల రాజేష్, లక్ష్మణ్, దినేష్, హరి, రాజా, గోపి, చెంబెడు జానీ, శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు
*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 72 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, నాదెండ్ల రాజేష్, హరి,గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , కల్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు ,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి,
*వీర మహిళలు, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, శకుంతలమ్మ, పద్మ ,తదితరులు పాల్గొన్నారు*
